Harish Rao | సిద్దిపేట : హనుమాన్ విజయోత్సవం సందర్బంగా సిద్దిపేటలో రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన హనుమాన్ మాలధారణ స్వాముల భిక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పల్లకి సేవలో హనుమాన్ స్వాములతో కలసి హరీశ్రావు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి సీతా దేవిని శ్రీరామచంద్ర స్వామికి అప్పగించిన సందర్బంగా హనుమాన్ సేవలు అమోఘమని శ్రీ రాముడు ఆంజనేయున్ని మెచ్చుకొని సన్మానం చేసిన రోజు హనుమాన్ విజయోత్సవం అని అన్నారు. హనుమాన్ సర్వ జగత్ రక్షకుడన్నారు. హనుమాన్ స్వామి అనుగ్రహంతో అన్నింటా శుభం కలగాలని కోరుకున్నారు. ఈ సందర్బంగా హనుమాన్ మాలధారణ స్వాములతో కలసి భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు.