న్యూఢిల్లీ, మార్చి 12: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమరవీరులను గుర్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఈ నోటిఫికేషన్లో ప్రకటించింది. కాగా, ఇప్పటికే గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచనకు గుర్తుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.