హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి శనివారం రీథింక్ డేగా పాటించాలని మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రీథింక్ డే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ సూచించిన ట్రిపుల్ ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) మంత్రలో భాగంగా పాత బట్టలు, పుస్తకాలు, పేప ర్లు, చెప్పులు, బూట్లు, ఇ-వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువు లు, ప్లాస్టిక్ వస్తువులు, టాయ్లు తదితర వాటిని సేకరిస్తారు. ఇందుకోసం మున్సిపాలిటీల్లో 1,962 ట్రిపుల్ ఆర్ సెంటర్లను ఏర్పాటుచేశారు. వాటి నిర్వహణను స్వయం సహాయక సంఘాలను అప్పగించాలని, ప్రజలు ఇచ్చే వస్తువుల వివరాలను నమోదు చేయాలని సూచించారు.