హనుమకొండ చౌరస్తా, జూన్ 14: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. నీట్ ప్రవేశ పరీక్షలో వివిధ క్యాటగిరీల్లో ఎస్సార్కు చెందిన జీ వర్షిణి జాతీయ స్థాయిలో 226, వివేక్రాయ్ 257, ఈ సాయి 257వ ర్యాంకు సాధించారని చెప్పారు. అలాగే జీ బాలరాజ్ 657/720, మాధురీరెడ్డి 638, వివేక్రాయ్ 636, ఎం సింధు 631, వీ సాయి సిద్ధార్థ్ 630, డీ శ్రీవర్ష 615, కే వీరేశ్ 604వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఎస్సార్కు చెందిన 210 మందికి పైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరిస్తూ విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చైర్మన్, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి వెల్లడించారు. 50 సంవత్సరాల్లో పటిష్టమైన ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ.. ఏటా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం ఐపీఈలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ(మెయిన్) 2023లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు వివరించారు.