బంజారాహిల్స్, సెప్టెంబర్ 23: క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారికి మెరుగైన చికిత్సను అందించడంతోపాటు సాంత్వన కలిగించేలా చేస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు ప్రతిష్ఠాత్మక యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ (ఈఎస్ఎంవో) ద్వారా డిజిగ్నేటెడ్ ఆంకాలజీ పాలియెటివ్ సెంటర్గా గుర్తింపు లభించింది. తెలంగాణలోనే ఈ గుర్తింపు సాధించిన మొట్టమొదటి దవాఖానగా బసవతారకం ఘనతను దక్కించుకున్నది. ఈ మేరకు ఫ్రాన్స్లోని పారిస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుర్తింపు పత్రాన్ని దవాఖాన తరఫున డాక్టర్ ప్రణీత్ సువ్వారి స్వీకరించినట్టు దవాఖాన సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.