హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు.
అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్న రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. హోలీ పండుగను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. రసాయనాలు లేని రంగులు ఉపయోగించాలని పేర్కొన్నారు.