జనగామ : రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. అందరికీ 2వ డోస్ టీకాలు అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో 2వ విడత టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కరోనా మరోసారి పలు దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సామాజిక, భౌతిక దూరం పాటించాలని, మాస్కు లను విధిగా ధరించాలని ఎర్రబెల్లి సూచించారు.