జనగామ: రైతులు పండించిన ఆఖరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించి.. అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మంత్రి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.