హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి అద్భుతమని ప్రముఖ పర్యావరణవేత్త, గ్లోబల్ అలయన్స్ ఫర్ సైస్టెనబుల్ ప్లానెట్ నిర్వాహకుడు ఎరిక్ సోల్హిమ్ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్తో పాటు టీమ్ సభ్యులను ఆయన ట్విట్టర్లో అభినందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో అమితాబ్బచ్చన్ లాంటి ప్రముఖులు పాల్గొని, మొక్కలు నాటడంతో పచ్చదనంపై ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు అందజేయాలని కోరారు. దీనిపై గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ స్పందిస్తూ.. ఈ కార్యక్రమంలో మీరు కూడా మొక్కలు నాటడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆహ్వానించారు.