International Photography awards | కురవి, ఏప్రిల్ 22: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఏరబోయిన శంకర్ అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో పసిడి పతకం సాధించాడు. మార్చి 27న నిర్వహించిన ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా, 2వ ఫొటోరా ఇంటర్నేషనల్ సెలూన్-2023 ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. మొత్తం నాలుగు విభాగాలకు మూడు విభాగాల్లో శంకర్ తీసిన ఫొటోలు ఎంపికయినట్టు తెలిపాడు.
1.ట్రావెల్ (గోల్డ్ మెడల్),
2.బ్లాక్ అండ్ వైట్ (సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్),
3. నేచర్ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియా),
4.కలర్ విభాగంలో వివిధ దేశాల నుంచి 463 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కోనసీమలో జరిగిన ప్రభ జాతరలో శంకర్ తీసిన ఫొటోకు బంగారు పతకం దక్కింది. అరకులో వృద్ధుడు చుట్ట తాగుతూ కూర్చున్న ఫొటో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో తీసిన పక్షులు ఎగురుతున్న ఫొటో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యాయి. గెలుచుకున్న అవార్డులకు సంబంధించిన ప్రశంసాపత్రాలను శనివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక శంకర్కు అందజేశారు.