హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ అటవీ లక్ష్యాల సామర్థ్యాలను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణ,శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) కృషి అభినందనీయమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారులు కొనియాడారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్పై ఐఎఫ్ఎస్ అధికారులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం హైదరాబాద్లోని ఈపీటీఆర్ఐలో బుధవారం ముగిసింది.
ఇందులో పర్యావరణ ప్రభావ అంచనా, అవసరాలు, మదింపు పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. 16 మంది ఐఎఫ్ఎస్ అధికారులు శిక్షణ పూర్తిచేసుకోగా, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ ఎ వాణీప్రసాద్ పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా ఔటర్రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ను అధికారులు సందర్శించి డ్రిప్సిస్టమ్, సాడా సెంటర్ను పరిశీలించారు.