వాజేడు, నవంబర్ 23 : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్థులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు. మండల కేంద్రానికి దూరంగా గుట్టలపై 15 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, రాజకీయ, కుల సర్వేలో వీరి వివరాలు ఇప్పటివరకు నమోదు చేయలేదు. ఇప్పటికే మండలంలో సేకరించిన వివరాలను ఎంపీడీవో ఆఫీస్లో ఆన్లైన్ చేస్తున్నారు.
అయితే ఎన్యూమరేటర్లు గుట్టపై ఉన్న గిరిజనుల వివరాల సేకరణపై సందిగ్ధత నెలకొన్నది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ ఎంపీవో శ్రీకాంత్నాయుడు, కొంగాల పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి ప్రభాకర్ను వివరణ కోరగా.. భద్రతా కారణాల వల్ల గుట్టపైకి వెళ్లలేదని, అక్కడున్న వారిని కిందకు రావాలని కబురు పంపామని, వారు వస్తే వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.