హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం 51,905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ కోర్సుల కోసం 45,735 మంది, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం 6,170 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం తెలిపారు.
బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి జూన్ 2వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. వివరాలకు mjptbcwreis.telangana.gov.in చూడాలని, లేదా 040-23322377, 23328266 నంబర్లను సంప్రదించాలని సూచించారు.