హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అటవీ పచ్చదనంలో పదేండ్లలో హైదరాబాద్ 147 శాతం పెరుగుదల సాధించినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనడంతో తన హృదయం ఉప్పొంగిందని గ్రీన్ ఇండియా చాలెం జ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. 2011 నుంచి 2021 దశాబ్దంలో హైదరాబాద్లో పచ్చదనం 147శాతం పెరుగడంపై ఆనందం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుచూపుతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంతోనే ఈ ఘనత దక్కిందని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.