హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఇచ్చిన శిక్షణ అద్భుతంగా ఉన్నదని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ తరగతులకు బోధించే టీచర్లకు ప్రభుత్వం అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సులో (ఈఎల్ఈసీ) శిక్షణ ఇప్పించారు. ప్రాథమిక తరగతుల్లోని అందరు, ఉన్నత తరగతుల్లోని భాషేతర టీచర్లకు శిక్షణ పూర్తిచేశారు. ఆన్లైన్లో శిక్షణ పొందడంపైనా తర్ఫీదు ఇచ్చారు. ఈ నెల చివరివారం లేదా వచ్చే నెలలో టీచర్లకు రెండో విడత శిక్షణ ఇప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందిన టీచర్లపై అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ ఇటీవలే సర్వే నిర్వహించింది. 70 వేలమంది టీచర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఉపయుక్తంగా శిక్షణ