హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల ప్రవేశాలపై పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఎంఏ జ్యోతిషం కోర్సులో చేరేందుకు ఎంబీబీఎస్, బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు అర్హత కల్పించింది. ఇప్పటి వరకు బీఏ, బీఎస్సీ, బీకాం చేసిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించేవారు. శనివారం నాంపల్లిలోని వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ సెనెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. వర్సిటీలో రెండు కొత్త విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాలు కొత్తగా ఏర్పాటవుతాయి. ఒక్కో విభాగంలో నాలుగు చొప్పున మొత్తం 8 కోర్సులను ప్రవేశపెడతారు. అటు.. వర్సిటీలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అకాడమిక్ సెనెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ప్రొడక్ట్ డిజైన్), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, విజువల్ కమ్యూనికేషన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ కోర్సుల ఫీజులు ఇతర కాలేజీల్లో 1.50 లక్షల వరకు ఉండగా, తెలుగు వర్సిటీలో రూ.50 వేల ఫీజుతోనే పూర్తి చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఇక మాతృభాషలో లైబ్రరీ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తంగా అన్ని విభాగాల్లో 19 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ముఖ్యమైన నిర్ణయాలివీ: