EAMCET counselling | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఎంసెట్ (ఇంజినీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానున్నది. జూలై 5 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 28 నుంచి జూలై 8 వరకు వెబ్ఆప్షన్ల ఎంపిక, 12న సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్లో 1,56,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
సీఎస్ఈలో సీట్లు పెరిగే చాన్స్
ఈ ఏడాది బీటెక్ సీఎస్ఈ బ్రాంచిలో 5 వేలకు పైగా సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఈ సీట్లకు గత ఏడాది ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. పలు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా భర్తీచేసేందుకు అనుమతివ్వాలని కాలేజీల యాజమాన్యాలు కోరాయి. అనుమతి లభిస్తే అభ్యర్థుల ఆశలు ఫలించినట్లే!