హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శివనందన్కుమార్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇటీవలే విరమణ పొందగా, ఆయన స్థానంలో శివనందన్కుమార్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈఎన్సీతో పాటు అధికారుల బృందం వెళ్లి కలిసింది.