హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ పదవికి సీ మురళీధర్ గురువారం రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఈఎన్సీ జనరల్గా, ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్గా కొనసాగుతున్న అనిల్కుమార్ను కొత్తగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రస్తుతం ముగ్గురు సీనియర్లు ఉన్నారు. వారిలో అనిల్కుమార్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం ఉన్నారు. హరిరాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించారు.
ఈ నేపథ్యంలో ఆయన పేరును పకనపెట్టినట్టు సమాచారం. మరొక ఈఎన్సీ నాగేందర్రావు ప్రాజెక్టుల నిర్మాణం, అంతర్రాష్ట్ర జల వివాదాలు, డ్యామ్ సేఫ్టీ, అడ్మిన్ ఇలా అన్ని విభాగాల్లోనూ పట్టుంది. అయితే మే నెలలో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన పేరునూ పరిగణనలోకి తీసుకోనట్టు సమాచారం. అనిల్కు సైతం మరో ఏడాదిన్నర సర్వీస్ ఉండడంతోపాటు పెద్దగా వివాదాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయననే ఈఎన్సీగా నియమించేందుకు సరారు సమాలోచనలు చేస్తున్నది.