హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికపై తెలంగాణ హైకోర్టుకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైకోర్టు ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇద్దరు ఉద్యోగులను తిరిగి ఏపీకి పంపేయాలని, తెలంగాణ వారినే ఇకడ నియమించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గతంలో ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం ఇచ్చామని, అయినా ఇద్దరు ఏపీ ఉద్యోగులను ఇకడికి శాశ్వత ప్రాతిపదికపై తేవడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. మంగళవారం కూడా నిరసన వ్యక్తంచేస్తామని తెలిపారు. తమ డిమాండ్ను అమలుచేయకపోతే హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని తెలిపారు.