హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన మల్టీజోన్, జోన్, జిల్లా స్థాయి పోస్టుల నియామకాల్లో సీనియారిటీని పాటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవోఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. శుక్రవారం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన టీజీవోఏ సమావేశంలో కొత్త జోనల్ వ్యవస్థపై విస్తృతంగా చర్చించారు. వేతన సవరణ అనంతరం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులుగా చరిత్ర సృష్టించారని పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నేతలు జీ వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణయాదవ్, రవీందర్కుమార్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచాలి: పీఆర్టీయూ
నూతన జోనల్ వ్యవస్థలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్గా గుర్తించినందునవారిని జిల్లాలవారీగా విభజించి వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చాలా స్కూళ్లలో స్వీపర్లు లేనందున రెగ్యులర్ పద్ధతిలో స్వీపర్లు, స్కావెంజర్లను నియమించాలని, రేషనలైజేషన్ పూర్తిచేసిబదిలీలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో శాసనమండలి మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, వివిధ జిల్లాలకు చెంది న కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.