హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమిళనాడు వరకు నిన్న ఉపరితల ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇవాళ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి తెలంగాణలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.