హైదరాబాద్, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ): జిల్లాల గ్రీవెన్స్ కమిటీలను సమావేశపరిచి నిబంధనల మేరకు హేతుబద్ధమైన ఎన్నికల కేసులను సత్వరమే పరిషరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. జిల్లాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్వోలు, ఆర్వోలతో శనివారం ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదులను వారి దృష్టికి తెచ్చారు. ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ నొకి చెప్పారు.
పోలీసు నిఘా, పనితీరు ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఫ్లాగ్ మార్చ్, డ్రోన్లతో చిత్రీకరిస్తూ ఉండాలని రాష్ట్ర వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి మహేశ్ భాగవత్ సూచించారు. నగదు, మద్యం, బంగారం వంటివి పట్టుబడ్డప్పుడు తప్పకుండా రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల అధికారులు స్పష్టమైన తీర్మానాలతో నివేదికలు పంపాలని అదనపు సీఈవో లోకేశ్కుమార్ సూచించారు. వివిధ ఫారాల వినియోగాన్ని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. పోస్టల్ బ్యాలెట్ అవసరమైన వారికోసం 12 డీ ఫారాన్ని వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని డిప్యూటీ సీఈవో సత్యవాణి సూచించారు. ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఈఆర్వోలు, ఆర్వోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.