హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో 30 ఎలక్షన్ పిటిషన్లు దాఖలయ్యాయి. వారు సమర్పించిన అఫిడవిట్లలో తప్పులు ఉన్నాయంటూ ప్రత్యర్థులు ఈ పిటిషన్లు వేశారు. హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు వ్యతిరేకంగా అజారుద్దీన్, కూకట్పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ పిటిషన్లు వేశారు. గద్వాల, ఆసిఫాబాద్, పటాన్చెరు, కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈవీఎంలకు సంబంధించిన ఎలక్షన్ పిటిషన్(ఈపీ)లను ఎన్నికలు ముగిశాక 45 రోజుల్లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18 వరకు పిటిషన్లను సేకరించారు. ఈవీఎంలతో సంబంధంలేని కేసులున్న నియోజకవర్గాల ఈవీఎంలను పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు అదనపు ఈవీఎంలు కావాలంటూ సీఈవో వికాస్రాజ్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.