హైదరాబాద్: ఓటర్ల తుది జాబితాను (Voter list) కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల సవరణ అనంతరం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 కాగా.. మహిళా ఓటర్లు 1,50,98,685 మంది ఉన్నారని స్పష్టం తెలిపింది. 1,735 మంది ఇతర ఓటర్లు ఉన్నారని వెల్లడించింది. అదేవిధంగా 18-19 ఏండ్ల వయసు కలిగిన ఓటర్లు 1,36,496 మంది ఉన్నారని పేర్కొన్నది. 2021తో పోలిస్తే సుమారు రెండు లక్షల ఓటర్లు పెరిగారని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, 19,314 ప్రాంతాల్లో 34,867 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య – 3,03,56,894
పురుష ఓటర్లు – 1,52,56,474
మహిళా ఓటర్లు – 1,50,98,685
ఇతర ఓటర్లు – 1,735
18-19 ఏండ్ల మధ్య ఓటర్లు – 1,36,496