హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వినియోగిస్తున్న భాష, చేస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత అంశాలపై, ఆధారాలు లేని అంశాలపై మాట్లాడొద్దని హెచ్చరించింది.
జగన్పై టీడీపీ చేసిన ఫిర్యాదులు, చంద్రబాబుపై వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని సూచించింది.