మహబూబాబాద్, ఆగస్టు 30: ఇల్లు మర మ్మత్తు, ఆరోగ్యం బాగుచేయిస్తానంటూ ఓ ప్రబుద్ధుడు కన్నతల్లిని నమ్మించి.. ఆమె పేరిట రూ.12.40 లక్షల రుణం తీసుకొని ఉడాయించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ సిగ్నల్ కాలనీకి చెందిన కడారి సరోజినీరాణికి ఇద్దరు కుమారులు రామకృష్ణ, శ్రీనివాస్, కుమార్తె ఉన్నారు. సరోజినీరాణి తొర్రూరులో అటెండర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె కుడి కాలు విరిగింది.
పెద్ద కుమారుడు రామకృష్ణ, అతని భార్య శిరీష, అత్త పుష్ప ఆమెకు దవాఖానలో చూపించి సపర్యలు చేశారు. దీంతో సరోజినీరాణి వారిని నమ్మింది. ఇదే ఆసరాగా చేసుకొన్న వారు.. ఆరోగ్యం బాగు చేయిస్తామని, మహబూబాబాద్లో ఉన్న ఇంటికి మరమ్మతులు చేయించడానికి పర్సనల్ లోన్ తీసుకుందామని నమ్మబలికారు. అందుకు ఆమె అంగీకరించి పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయగా, గత జూలై 14న రూ.12.40 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేశా రు. అప్పటినుంచి దూరంగా ఉంటూ కొన్ని రోజులకు ఇంటినుంచి పరారయ్యారు. పలుమార్లు రామకృష్ణను అడిగినా డబ్బుల విష యం తేల్చలేదు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ముత్యాలమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకొన్న పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసగించిన పెద్ద కొడుకు రామకృష్ణ ఇక తనకు లేడంటూ తల్లి శిరోముండనం చేసుకొన్నారు.