IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ శాంతి కుమారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్గా కే సురేంద్ర మోహన్కు అదనపు బాధ్యతలు బాధ్యతలు అప్పగించింది. ఆరోగ్యశ్రీ సీఈఓగా ఆర్వీ కర్ణన్కు అదనపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ సీఈఓగా ఉన్న ఎల్ శివశంకర్ను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక వాణిజ్య పన్నుల డైరెక్టర్గా కే హరితను నియమించింది. ప్రస్తుతం వాణిజ్య పన్నుల డైరెక్టర్గా ఉన్న సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వినీ బదిలీ చేసింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఉన్న పీ ఉదయ్కుమార్ను బదిలీ చేయడంతోపాటు ఆ బాధ్యతలను యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కే చంద్రశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించింది. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్గా వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను బదిలీ చేసింది. రాష్ట్ర టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా బీ శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.