హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎం నీరదారెడ్డి మృతిచెందారు. వయోభారంతో పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం శ్రీనగర్కాలనీలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా సేవలందించారు. 1999 -2004 కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి వైస్ చైర్పర్సన్గా పనిచేశారు.
నీరదారెడ్డి ఆ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం గమనార్హం. ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఆమె నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కాలేజీలను నియంత్రించేందుకు ఆమె పలు సిఫారసులు చేశారు. ప్రొఫెసర్ నీరదారెడ్డి మృతిపట్ల విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన పరిపాలనాధికారిగా, విద్యావేత్తగా గుర్తింపు పొందారని ఆమె సేవలను గుర్తుచేసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి ఆమె భౌతికకాయానికి నివాళలర్పించారు.