హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సాధిస్తున్న విద్యారంగ విజయాలను తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సూల్ ఎడ్యుకేషన్పై మూడు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. స్వీయ పాలనతో రాష్ట్రంలో విద్యారంగం స్వరూపమే మారిపోయిందనని తెలిపారు.తొమ్మిదేండ్లలోనే సర్కారీ విద్య కార్పొరేట్కు దీటుగా పోటీ పడుతున్నదని చెప్పారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువగా నమోదు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.