నల్లమలకు చేరిన శుద్ధజలం
నిరంతరంగా తండాలు, గూడెంలకు నీటి సరఫరా
తీరిన గిరిజన ఆడబిడ్డల కష్టాలు
శాశ్వత పరిష్కారం చూపిన తెలంగాణ సర్కారు
నాగర్కర్నూల్ జిల్లాలో 280 గిరిజన ఆవాస గ్రామాలకు మిషన్ భగీరథ
అచ్చంపేట, మార్చి 21 : ఏండ్ల తరబడి పీడిస్తున్న తాగునీటి ఇబ్బందులకు తెలంగాణ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపింది. ఎండా కాలం వస్తే, వ్యవసాయ పొలాలు, చెలిమెల వెంట పరుగులు తీసిన గిరిజన తండాలు, చెంచు గూడెంల ఆడబిడ్డల కష్టాలకు విముక్తి లభించింది. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధజలం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో నల్లమల వాసుల నీటి గోసకు చెక్ పడింది. భగీరథ జలం కొండలు, గుట్టలు, అడవులు దాటి పైపులైన్ల ద్వారా తండాలు, చెంచుగూడెంలకు చేరుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలో 280 గిరిజన ఆవాస గ్రామాలకు శుద్ధజలం అందుతున్నది.
గిరిజన తండాలు, చెంచు గూడెంలలో ఏండ్ల తరబడి పీడిస్తున్న తా గునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. బిందెలు పట్టుకొని నీళ్ల కోసం బావులు, బోర్లు, వ్యవసాయ పొలాలు, వాగులు, చెరువులకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలకు చెక్ పడింది. కొట్లాట లు బంద్ అయినవి. కుటుంబంలోని అందరూ నీళ్ల కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. గత్యంతరం లేక కలుషిత నీటిని తాగి రోగాలు తెచ్చుకునేవా రు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని కష్టాలన్నీ తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగరథతో గిరిజనుల తాగు నీటి గోస తీరింది. మిషన్ భగరథ ద్వారా అమృతజలం తండాలు, గూడెంలకు చేరుకున్నది. కొండలు, గుట్టలు, అడవులు దాటి పైపులైన్ల ద్వారా స్వచ్ఛమైన జలం అందుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ వంటి అటవీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రా మాలు, తండాలకు నీళ్లు చేరుతున్నాయి. అచ్చంపేట మండలం బక్కలింగాయపల్లి, పదర మం డలం మద్దిమడుగు, లింగాల మండలం ఎర్రపెం ట వంటి అటవీ చివరి గ్రామాలకు కూడా నీరు అందుతున్నది. గిరిజన గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా చుక్కనీరు కూడా రావడం లే దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన ఆరోపణలపై గిరిజనులు మండిపడుతున్నారు. తమ గ్రామాలకు ప్రతి రోజూ రెండు ద ఫాలు స్వచ్ఛమైన జలాలు అందుతునాయంటున్నారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ స్వచ్ఛమై న జలాలు అందిస్తుంటే నోటికొచ్చినట్లు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
280 ఆవాస గ్రామాలకూ జలాలు..
నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధి లో 280 గిరిజన ఆవాస గ్రామాలు ఉన్నాయి. అ న్ని గ్రామాలకూ మిషన్ భగీరథ అమృత జలం అందుతున్నది. గిరిజన ఆవాస గ్రామాల్లో 205 ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించారు. 300 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ పైపులైన్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల కుటుంబాలకు శుద్ధజలం అం దుతున్నది. 92 వేల జనాభాకు 24 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. రెండు దఫాలుగా మినరల్స్తో కూడిన నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటినే తా గేందుకు, స్నానానికి, మూగజీవాలకు వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కూడా నీటి స మస్య తీరింది. గతంలో అధికారులు, సర్పంచు లు బోర్లు, చేతిపంపులు చెడిపోతే మరమ్మతులు చేయించి తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెక్కించేవారు. కొన్ని రోజులకే మళ్లీ రిపేరుకు వచ్చేవి. నీ టి సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ శాతం నిధులను కేటాయించేవారు. అయినా సమస్య అలాగే ఉండేది. వేసవికాలంలో ఈ సమస్య మ రింత జఠిలంగా మారేది. వీటన్నింటికీ మిషన్ భగీరథతో చెక్ పడిందని చెప్పొచ్చు.
రూ.12 కోట్లతో..
నల్లమల ప్రాంతంలో అడవితల్లిని నమ్ముకొని జీవనం గడుపుతున్న ఆదివాసీ చెంచులు కలుషిత నీటిని సేవించి మృత్యువాతపడిన సందర్భాలు కో కొల్లలు. వాగులు, వంకలు, చెలిమెలలో జంతువులు తాగే నీటినే చెంచులు సేవించేవారు. అయి తే టైగర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతం కావడంతో మి షన్ భగీరథకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలే దు. విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ విషయాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మే రకు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని మిగిలిన గ్రామాలు, చెంచు పెంటలకు నీటిని అందించేందుకు సంకల్పించారు. 16 గ్రామాలకు రూ.12 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి.
అమ్రాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛజలం అందుతున్నది. సౌరవిద్యుత్ ద్వారా బోరువేసి, మోటరు బిగించి, ట్యాం కు ద్వారా పైపులైన్ వేసి ఇంటింటికీ నల్లాలు అమర్చారు. దీంతో ఆదివాసీలు తరతరాలుగా గోస తీ స్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ల భించింది. ఈర్లపెంటలో ఊటబావికి మోటరు బిగించి ట్యాంకు ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా లు అమరుస్తున్నారు. పట్టణాల నుంచి మారుమూల ప్రాంతం వరకు శుద్ధజలం అందుతున్నది. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యను మిషన్ భగీరథ పథకంతో పరిష్కారం లభించడం తో ప్రజలు, చెంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీళ్ల బాధ తప్పింది..
మా తండాలో నీళ్లులేక చాలా ఇబ్బంది ప డేటోళ్లం. బోరింగులు కొట్టి కొట్టి చేతులు కా యలు కాసేవి. గంట కొడితే ఒక్క బిందె వ చ్చేది. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంట్లోకే స్వచ్ఛమైన తాగునీళ్లు వస్తున్నాయి. నీళ్ల బాధ తప్పింది. మా తండాలో ఇంటింటికీ నల్లాలు బిగించి నీళ్లు వదులుతున్నారు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
ఎడ్లబండిపై నీళ్లు తెచ్చుకునేటోళ్లం..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో మా తండాలో నీళ్ల కరువు పోయింది. గతంలో నీళ్ల కోసం ఎడ్ల బండ్లపై డ్రమ్ములు వేసుకుని చేన్లలో తిరిగి తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడు ప్రతి రోజు ఉదయాన్నే రెండు గంటలపాటు నీళ్లు వస్తున్నాయి. తండాలో నీళ్ల కష్టాలన్నీ తప్పినయి. ఇంటింటికీ నల్లాలు బిగించి నీళ్లు వదులుతుండడంతో గోస తీరింది.