హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ పేరిట 300 మందికిపైగా డిపాజిటర్ల నుంచి రూ.80 కోట్లు వసూలు చేసిన ‘భువన తేజ ఇన్ ఫ్రా రియల్ఎస్టేట్’ ప్రాజెక్టు కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బుధవారం ఈడీ అధికారులు నానక్రాంగూడలోని భువన తేజ ఇన్ఫ్రా డైరెక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం నివాసం, సూరారంలోని మా ర్కెటింగ్ డైరెక్టర్ బీబీ గుప్తా ఇంటితోపాటు ఐదుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ప్రీలాంచ్ స్కీమ్ పేరిట వసూలు చేసిన డిపాజిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించింది. నిర్ణీత గడువులోగా డిపాజిటర్లకు ప్లాట్లు కేటాయించలేదని, ప్రీలాంచ్ పేరిట వసూలు చేసిన డబ్బును రియల్ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించారని ఈడీ అధికారులు గుర్తించారు. ప్రీలాంచ్ పేరిట మోసం చేసిన భువనతేజ ఇన్ఫ్రాపై నిరుడు హైదరాబాద్ సీసీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హ్యాపీహోమ్స్ ఫేస్-1, 2, భువనతేజ ఆరా ఫేస్-2 ఫ్లాట్లను ప్రీలాంచ్ పేరిట మార్కెటింగ్ చేసినట్టు సీసీఎస్ పో లీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. అ పార్ట్మెంట్లు కట్టకుండా, ఫ్లాట్లు కేటాయించకుండా మోసంచేసినట్టు పోలీసు లు గుర్తించారు. ‘సీసీఎస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్’ కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టింది.