హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : గ్యాంబ్లింగ్ (జూదం) కింగ్ చీకోటి ప్రవీణ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులిచ్చింది. థాయ్లాండ్లో భారీ గ్యాంబ్లింగ్ రాకెట్లో దొరికిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి (హైదరాబాద్లో ఈడీ కేసులో ఏ1), మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఈనెల 15న ప్రత్యక్షంగా హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నది. గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిన కేసులో చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణను ఎదుర్కొన్నాడు. తాజా నోటీసులివ్వడంతో మరోమారు ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్నాడు. కాగా, థాయ్లాండ్లోని పట్టాయాలో మహిళలతో కలిసి జూదం డెన్ను ఏర్పాటు చేసిన చీకోటి ప్రవీణ్ సుమారు రూ.100 కోట్లతో అక్కడికి పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రవీణ్తో పాటు మరో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.