ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసుకు సంబంధించిన జరిగిన వాదనల్లో ఈడీ.. కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరును ఈడీ రాయలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం కేసులో కొందరు కావాలనే కేసీఆర్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వాదనల సందర్భంగా మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించిందని న్యాయవాది మోహిత్రావు తెలిపారు. తన తండ్రి గురించి మాగుంట రాఘవ ప్రస్తావించారని పేర్కొన్నారు. మాగుంట రాఘవ తన తండ్రి శ్రీనివాసులురెడ్డికి లిక్కర్ కేసులో ఉన్నవారిని పరిచయం చేశారని చెప్పారని తెలిపారు. శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ పేరుకు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని హితవు పలికారు. లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్పై ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వాంగ్మూల పత్రాన్ని న్యాయవాది మోహిత్రావు బహిర్గతం చేశారు.
Big Breaking
కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు
ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు.. కోర్టులో ఈడి న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని.
శ్రీనివాసులు… pic.twitter.com/lB5CeoTR4Z
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024