హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శ్రీ కృష్ణ స్టాకిస్ట్, ట్రెడర్స్ యజమాని తోట కన్నారావుకు చెందిన రూ.37.38 కోట్లు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. తోట కన్నారావు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ, కెనరా బ్యాంకుల నుంచి శ్రీ కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రెడర్స్,
శ్రీ కృష్ణా అగ్రి ప్రాసెస్ ఇండియా కంపెనీలు రూ.528.26 కోట్ల రుణాలు తీసుకొని దారిమళ్లించినట్టు గుర్తించిన ఈడీ ఆ సంస్థలకు చెందిన ఆస్తులకు అటాచ్ చేసింది. వివాదాస్పద రుణ యాప్లపై కూడా ఈడీ కొరడా ఝుళిపించింది. 12 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లకు చెందిన రూ.105.32 కోట్ల బ్యాంకు బాలెన్స్లను ఈడీ సీజ్ చేసింది.