హనుమకొండ చౌరస్తా, మార్చి 18 : దళితబంధుతో మాదిగలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ 8వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ నేతలు మైస ఉపేందర్, జంగ్ జకార్యా, రాయికంటి రాందాస్, పీసీసీ కార్యదర్శి పీ వినోద్కుమార్, బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుగని నర్సింహులు, కోల జనరంజన్, ఎంహెచ్పీహెచ్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జింక భాగ్యలక్ష్మీ, ఎంహెచ్పీహెచ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల వెంకటేశ్, సముద్రాల సంపత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కందుకూరి బాబు, చెన్నం గోపి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, రాజు, సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గడిపె చక్రపాణి, వేల్పుల రాంకుమార్ పాల్గొన్నారు.