కృష్ణకాలనీ : టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై, టీబీజీకేఎస్పై ఈటల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి మాట్లాడుతూ పదవులిచ్చి, రాజకీయంగా అన్నింటా సముచిత స్థానం కల్పించిన కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసి, పేద ప్రజల భూములు ఆక్రమించుకున్న మోసగాడు ఈటల రాజేందర్ అని మండిపడ్డారు.
తెలంగాణ సంప్రదాయన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కవితక్కను విమర్శించే హక్కు ఈటలకు లేదన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్మికుల అనేక హక్కులు నెరవేరాయన్నారు. కబ్జాకోరు ఈటల రాజేందర్.. ఖబడ్దార్.. నీ స్థాయిని మించి మరోసారి మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.