సిడ్నీ: విటమిన్ డీ లోపం ముందస్తు మరణానికి దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. తగిన స్థాయిలో విటమిన్ డీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. విటమిన్ డీ లోపం ఎంత ఎక్కువ అయితే, మరణ ముప్పు అంత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఎముకలు, కండరాలు బలంగా ఉండేందుకు విటమిన్ డీ దోహదపడుతుంది.