హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీ సెట్ (ఎప్సెట్) దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా, తొలిరోజు 3,113 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి 1,983 అర్జీలు రాగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 వరకు, ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.