యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.