హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో తెలంగాణ గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు శనివారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీతో పాటు గొర్రెల కాపరులకు అందిస్తున్న పథకాల అమలుపై చర్చించారు. దీంతోపాటు ఇటీవల చేపట్టిన ‘గొర్రె మంద వద్ద పల్లె నిద్ర కార్యక్రమం’, ‘మాట-ముచ్చట’ కార్యక్రమంపై బాలరాజు సీఎస్కు వివరించారు.