కాశీబుగ్గ, ఫిబ్రవరి 5 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గురువారం యూఎస్-341 రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. గత నాలుగు సంవత్సరాల సీజన్లో అత్యధికంగా క్వింటాలు రూ.26,700 పలికినట్లు అధికారులు తెలిపారు. నిరుడు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ధర పలుకగా బుధవారం పెద్ద మొత్తంలో ధరలు పలికినట్గు అధికారులు తెలిపారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సింగారం గ్రామానికి చెందిన సాంబయ్య 54 బస్తాల మిర్చి తీసుకురాగా.. సత్యనారాయణ బజాజ్ ట్రేడర్స్ అడ్తి ద్వారా శ్రీ గణేశ్ స్పైసెస్ ఖరీదు వ్యాపారి కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 10వేల క్వింటాళ్లు (20వేల బస్తాలు) రాగా గురువారం మార్కెట్కు 2500 బస్తాలు వచ్చాయి. క్వింటాలుకు అత్యధికంగా రూ.26,700, మధ్యరకానికి రూ.24,500, కనిష్ఠంగా రూ.12,500 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. వండర్ హాట్ మిర్చికి ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో క్వింటాలు రూ.38వేల ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు.