Sangareddy | సంగారెడ్డి : ఓ వాచ్మెన్ పీకల దాకా మద్యం సేవించి కిచెన్లో పడిపోయాడు. అక్కడున్న అన్నం గిన్నెలో కాలు వేసి నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటనను చూసి విద్యార్థులు, అధ్యాపకులు షాక్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట్కు సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఓ వాచ్మెన్ పీకల దాకా మద్యం సేవించాడు. ఇక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వర్కర్లు అన్నం రెడీ చేశారు. అంతలోనే కిచెన్లోకి ప్రవేశించిన వాచ్మెన్ మద్యం మత్తులో తూలుతూ అక్కడే పడిపోయాడు. అన్నంతో కూడిన గిన్నెలో కాలు వేసి నిద్రలోకి జారుకున్నాడు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి అతన్ని నిద్రలో నుంచి మేల్కొలేపేందుకు ప్రయత్నించారు. కానీ అతను స్పృహాలోకి రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించి వాచ్మెన్ను విధుల నుంచి తొలగించారు.