హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ లేబరేటరీ (డీఆర్డీఎల్)లో మంగళవారం డీఆర్డీఎల్ ఇండస్ట్రీ పార్ట్నర్స్, అసోసియేట్స్ మీట్-2023 నిర్వహించారు. దీనిని డీఆర్డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డీఆర్డీఎల్తో వ్యాపారానికి ఉన్న అవకాశాల గురించి నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో 150 మంది వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.