హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎంఎన్జే దవాఖానకు రూ.9 లక్షల విలువైన కీమోథెరపీ మందులను డాక్టర్ రెడ్డీస్ల్యాబ్ అందజేసిందని దవాఖాన క్లినికల్ అంకాలజిస్టు డాక్టర్ చింతమడక సాయిరాం తెలిపారు. నిరుపేద రోగులకు సహాయర్థం ఈ మందులను ఏప్రిల్లో రెండు విడతలుగా అందజేసిందని వివరించారు. క్యాన్సర్కు చేసే కీమోథెరపీ చికిత్సలో ఒక్కొక్కొ రోగికి వారానికి రూ.6 వేల నుంచి రూ.9 వేల విలువైన వయల్స్ వాడాల్సి ఉంటుందని తెలిపారు.