హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నేషనల్ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ వైస్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ హెడ్ డాక్టర్ అజయ్ అగర్వాల్కు ప్రతిష్ఠాత్మక ‘భారత్ గౌరవ్’ అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ సోషల్ సర్వీసెస్ రంగంలో సమాజానికి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఇటీవల లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రముఖుల సమక్షంలో లండన్ మేయర్ సునీల్ చోప్రా అవార్డు అందించారు.
అగర్వాల్కు యూకే ఎంపీ డాక్టర్ వీరేంద్రశర్మ, హౌస్ ఆఫ్ లార్డ్స్ చైర్మన్ బారోనెస్వర్మ, యువ సంస్కృతి వ్యవస్థాపకుడు సురేశ్మిశ్రా సర్టిఫికెట్, గోల్డ్ మెడల్, శాలువాతో సత్కరించారు. 10వ ఎడిషన్ అవార్డుకు భారతీయ చలనచిత్ర దర్శకుడు మధుర్ భండారర్, గాయత్రి పరివార్ చిన్మయ్పాండ్యా, మేదాంత గ్రూప్ సీఎండీ డాక్టర్ నరేశ్ ట్రెహాన్, జెట్ ఎయిర్వేస్ అంకిత్ జలన్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంపిక అయ్యారు. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి అవార్డు గ్రహీతలు హాజరయ్యారు. అవార్డును అందుకున్నందుకు చాలా గర్వంగా ఉందని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా డాక్టర్ అజయ్ అన్నారు.