జనగామ : కరోనా రెండో దశ పై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వంద పడకల కొవిడ్ ఐసోలేషన్ వార్డును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరైనా అస్వస్థతకు గురైతే స్థానిక ప్రభుత్వ దవాఖానలో వైద్యం పొందవచ్చన్నారు.
అనవసరంగా హైరానా పడి హైదరాబాద్కు పరుగులు తీసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా దవాఖానలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం