హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పంతాలకు పోయి.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్ల డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉద్యోగోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిషరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా బ్యాచ్లకు చెందిన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా 37 మందికి ఉద్యోగోన్నతులు రావాల్సి ఉండగా కొందరు అధికారులు కోర్టులను ఆశ్రయించడంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్లో ఉంది. దీంతో డీజీపీ చొరవ తీసుకుని ఆయా బ్యాచ్ల అధికారులతో సమావేశమయ్యారు.
కేసుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చారు. కోర్టు కేసుల కారణంగా ఉద్యోగోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతున్నదని డీజీపీ వివరించారు. డీజీపీతో సమావేశం అనంతరం వరంగల్ జోన్కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్ల అధికారులు కోర్టులో దాఖలు చేసిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు డీజీపీకి లేఖ అందించారు. హైదరాబాద్కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్ల అధికారులు కూడా కేసుల ఉపసంహరణకు సుముఖత వ్యక్తంచేశారు.