Doddi Komuraiah | హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య( Doddi Komuraiah ) జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయం( DGP Office )లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, ఐజీ కమల్ హాసన్ రెడ్డి, షా నవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితరులు హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు.