హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డి కొమరయ్య 97వ జయంతిని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కొమరయ్య అమరత్వాన్ని శ్లాఘించారు.
సంక్షేమశాఖ భవన్లో నిర్వహించిన జయంతిలో బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి, ఎంబీసీ సీఈవో అలౌక్కుమార్, బీసీ సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఝాన్సీ, ఉదయ్, శ్రీనివాస్రెడ్డి, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీ జేసీ మదిలేటి, డిప్యూటీ సెక్రటరీ తిరుపతి, మంజుల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.